రాహుల్ పై ఎటాక్.. నిందితులు దొరికారా ?

ఇటీవల పబ్ లో జరిగిన గొడవలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేజ్ రెడ్డి, ఆయన స్నేహితుల గ్యాంగ్ బిగ్ బాస్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు బాటిల్స్ తో ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంతో తనకి న్యాయం చేయాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ని కూడా రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు.. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాహుల్ కి సపోర్ట్ తెలిపాడు. దీంతో ఈ వ్యవహారం మరింత సీరియస్ అయింది. 

ఈ నేపథ్యంలో నిందితులని పట్టుకొనేందుకు  పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోదరుడు రితీశ్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు బెంగళూరుకు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు వారి కోసం అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, నిందితులు అక్కడి నుంచి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారమ్.