తొక్కేయడంలో చంద్రబాబు దిట్ట

రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకుండా తెదేపా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వర్ల రామయ్యని తెదేపా అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అంతేకాదు.. వైసీపీ ఎమ్మేల్యేలు ఆలోచించుకోవాలని.. టీడీపీకి ఓటెయ్యేలాని పిలుపునిచ్చారు. దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో బాబుపై సటైర్స్ వేశారు. నమ్మున వాళ్లని తొక్కేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

‘టీడీపీలో చంద్రబాబు ఎప్పుడూ తన వాళ్లకే పెద్ద పీట వేశాడు. బలివ్వాల్సి వచ్చినపుడు మాత్రం దళితులు, బిసిలు గుర్తుకొస్తారు. మోత్కుపల్లి, పుష్పరాజ్, బంగి అనంతయ్య నుంచి ప్రస్తుత వర్ల రామయ్య గారి వరకు అదే తంతు. గెలిచే ఛాన్సున్న దగ్గర తన వాళ్లు, ఓడే ప్రమాదం ఉన్న దగ్గర దళితులు!’

‘విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు. నమ్మిన వాళ్లను తొక్కేయడంలో దిట్ట. మోపిదేవి, బోస్ ల పార్టీ విధేయతను గుర్తించి సిఎం జగన్ గారు ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే నీకూ జగన్ గారికి తేడా’

‘ఎలక్షన్లలో మందు, డబ్బు పంపిణీ చెయ్యనీయకుండా ఆపటానికి మీరెవరని టీడీపీ ప్రశ్నిస్తోంది. వీటిని అడ్డుకునే ఆర్డినెన్సు చెల్లదట. కోర్టుకెళ్లైనా మందు పంచిపెట్టడానికి అనుమతి సాధిస్తామని సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నారు. అడ్రసు గల్లంతయ్యే ముందు ఇలాంటి పిచ్చి ఐడియాలే వస్తాయి’ అంటూ వరుస ట్విట్స్ చేశారు విజయసాయి.