సాయి తేజ్ పొలిటికల్ ఎంట్రీకి పవన్ క్లాప్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయన మేనల్లుడు, మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ ఎంట్రీకి క్లాప్ కొట్టారు. వరుస ప్లాపుల్లో సతమతమైన సాయితేజు ‘చిత్రలహరి’ హిట్ తో తిరిగి నిలబడిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ ని ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో కంటిన్యూ చేశారు. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’లో నటిస్తున్నారు తేజు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. మే 1న ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే దేవాకట్టా సినిమాకి తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై… క్లాప్ కొట్టారు. పొలిటికల్ టచ్ ఉన్న థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారమ్. దీంతో తేజు పొలిటికల్ ఎంట్రీకి పవన్ క్లాప్ కొట్టారని చెప్పుకొంటున్నార్ మెగా అభిమానులు. ఈ చిత్రంలో తేజు స‌ర‌స‌న నివేదా పెతురాజ్ జతకట్టనుంది. మణిశర్మ సంగీతం అందించనున్నారు. మే నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది.