అందుకే ‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకుందట !

హీరోయిన్ త్రిష మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం హీరోయిన్ గా త్రిషని తీసుకున్న సంగతి తెలిసిందే. రెండోసారి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దొరికినందుకు త్రిష ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

తీరా ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొనాల్సిన సమయంలో.. ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చింది త్రిష కారణమేంటీ అంటే ? క్రియేటివిటీ డిఫరెన్సెస్ అని చెప్పింది. “కొన్ని విషయాలు తొలుత చెప్పినట్లు, చర్చించుకున్నట్లు కాకుండా విభిన్నంగా మారుతుంటాయి. క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి సర్‌ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా. చిత్ర బృందానికి నా అభినందనలు. తెలుగు ఆడియన్స్‌.. మరొక మంచి ప్రాజెక్టుతో మిమ్మల్ని త్వరలోనే కలుస్తానని ఆశిస్తున్నా”నని త్రిష్ ట్వీట్‌ చేశారు.