వెంకీ కథని నచ్చిన మహేష్

ఎంటర్ టైనర్ కథలంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా ఇష్టం. ఆ కథలు దొరికితే మహేష్ అస్సలు ఆగడు. దూకుడు చూపిస్తాడు. అనిల్ రావిపూడి చెప్పిన కథలో వినోదం నచ్చే.. ఆయనకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా.. సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇప్పుడు మరో ఎంటర్ టైనింగ్ కథ మహేష్ వద్దకి వచ్చినట్టు.. దాన్ని ఆయన వెంటనే ఓకే చేసినట్టు సమాచారమ్. భీష్మ దర్శకుడు వెంకీ కడుముల ఇటీవల మహెష్ కి ఓ కథ చెప్పాడు. అది మహేష్ కి నచ్చినట్టు సమాచారమ్. కథని వినోదాత్మకంగా నడపడంలో వెంకీ కడుముల స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఛలో, భీష్మల సినిమాలే అందుకూ నిదర్శనం. వెంకీ రాత, తీతకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే ఫిదా అయ్యారు. వెంకీని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. 

 వెంకీ చెప్పిన స్టైల్‌, స్టోరీ లైన్ నచ్చిన మహేష్ వెంటినే ఈ లైన్‌ని డెవలప్ చెయ్ మనం చేద్దామని వెంకీకి ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ లైన్‌ని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మార్చేపనిలో వెంకీ కుడుముల బిజీ అయిపోయారని తెలిసింది. మహేష్‌కి వెంకీ సిద్ధం చేస్తున్న స్క్రిప్ట్ నచ్చితే సినిమా పట్టాలెక్కడం ఇక లాంఛనమే