ఏపీలోనూ కరోనా సెలవులు

కరోనా ప్రభావంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెలవులని ప్రకటించింది. తక్షణమే విద్యాసంస్థలని మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం విద్యాసంస్థలు మాత్రమేనా ? థియేటర్స్, షాపింగ్ మాల్స్, వేడుకలకి నో చెబుతారా ? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కరోనాపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత పూర్తి వివరాలని ప్రకటించనున్నారు.

ఇక ఏపీలో ఒక కరోనా కేసు నమోదైంది. నెల్లూరి వాసికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయనకి చికిత్స అందిస్తున్నారు. కరోనా అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఏపీ ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో.. సీఎం జగన్ కరోనా సెలవులని ప్రకటించేశారు. కరోనా పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనే ఏపీ ప్రభుత్వం అనుసరించే అవకాశం ఉంది.