కరోనా ఎఫెక్ట్.. తిరుమల ఖాళీ !

కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారిని కూడా తాకింది. గతంలో మాదిరిగా భక్తులని కంపార్ట్ మెంట్స్ లో ఉంచడం లేదు. టోకెన్స్ అందించి నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. ఏ సమయానికి టోకన్ ఇస్తే.. ఆ సమయంలోనే వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో.. తిరుమల కంపార్ట్ మెంట్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. 

అంతేకాదు.. శ్రీవారి ఉత్సవ మూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలని తాత్కాలికంగా రద్దు చేశారు. పుష్కరిణిలో స్నానాలు కూడా నిలిపివెయ్యాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. భక్తులు పుష్కరిణి నీటితో స్నానమాచరించేందుకు ప్రత్యామ్నాయ అఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కరిణికి సమీపంలో 18 స్నానపు గదులు ఏర్పాటు చేశామని వెల్లడించారు.