గ్రేటర్ బాధ్యత రాజాసింగ్’దే ! 

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులైన సంగతి తెలిసిందే. సంజయ్ ఎంపిక వెనక ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. గ్రేటర్ హైదరాబాద్ నేతని కాదని అధ్యక్షపదవిని బయటి వారికి ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే గ్రేటర్ లో భాజాపా బాధ్యత మాత్రం రాజాసింగ్ కే అప్పగించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా రాజాసింగ్ ని నియమించబోటున్నట్టు కమలం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ నేతలతో రాజాసింగ్ కి విబేధాలు ఉండేవి. లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు రాజాసింగ్ తో విబేధించేవారు. అయితే రాజాసింగ్ కి బీజేపీ అధిష్టానం, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర మంచి పలుకుపడి ఉన్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భాజాపా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష బాధ్యతలని రాజాసింగ్ కి అప్పగించబోటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. త్వరలోనే నూతన రాష్ట్ర కమిటీలు, జిల్లా, మండల, గ్రామ కమిటీల నియామకం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.