కరోనా ఎఫెక్ట్.. రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు క్యాన్సిల్ !

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎలాంటి వేడుకలు జరపకూడని అభిమానులని కోరాడు చరణ్. ఇదే తనకి అభిమానులు ఇచ్చే గిఫ్ట్ అని కోరారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలకి మద్దతుగా బర్త్ డే వేడుకలని క్యాన్సిల్ చేయాలని చరణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ భామ అలియాభట్ నటిస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్ టీఆర్, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ జులై 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ వచ్చే యేడాది జనవరి 8కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.