కరోనాపై ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ పై మరికాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. ఇంతకీ ట్రంప్ చేయబోయే కీలక ప్రకటన ఏంటీ ? అన్నది ఇప్పుడు ఉత్కంఠ మారింది. కరోనాకి మందు కనిపెట్టాం అని ప్రకటిస్తారా ? లేదంటే కరోనా విషయంలో చైనాపై ఏమైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.

ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి 8000మందికి పైగా మృతి చెందారు. చైనా, ఇటలీ, బ్రిటన్ దేశాల్లో మృతుల సంఖ్య అధికంగా ఉంది. మనదేశంలో ఇప్పటి వరకు 152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. తెలంగాణలో ఐదు, ఏపీలో ఒక కేసు నమోదైంది. మనదేశంలో ఇప్పటి వరకు కరోనా సోకి ముగ్గురు చనిపోయారు.