కరీంనగర్ లో కరోనా కలకలం.. 8మందికి కరోనా పాజిటివ్ !

బుధవారం వరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3 మాత్రమే. తెల్లారేసరికి ఆ సంఖ్య 13కి చేరింది. కరీంనగర్ 8 మందికి కరోనా పాజిటివ్ తేలింది. వీళ్లంతా ఈ నెల 13న ఇండోనేషియా నుంచి భారత్ కి వచ్చారు. సంపర్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించి కరీంనగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో కరీంనర్ లో తిరిగారు. ప్రార్థనా స్థలాలని సందర్శించారు. 

మొత్తం 11మంది బృందంలో 8మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు హైదరాబాద్ పై ఫోకస్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కరీంనగర్ పై దృష్టి సారించింది. ఇండోనేషియా నుంచి వచ్చిన బృందం ఎక్కడెక్కడికి వెళ్లారు. ఎవరిని కలిశారు ? అనే వివరాలు సేకరించి.. వారికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 13కు చేరింది. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 160కి పెరిగింది.