పంజాబ్’లో మరో కరోనా మృతి

భారత దేశంలో నాల్గో కరోనా మృతి నమోదైంది. పంజాబ్ లో కరోనా సోకి ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ విషయాన్ని భారత వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రటించింది. దీంతో.. దేశంలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఇక ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 176కి చేరింది. రోజురోజూకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ జాతీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక కరోనా పట్ల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. విద్యాసంస్థలు, థియేటర్స్, దేవాలయాలు మూసేశారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కాగా, ఏపీ ఇద్దరికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాపై ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.