కేఏ పాల్’పై వర్మ కరోనా సటైర్లు

రామ్ గోపాల్ వర్మ, కేఏ పాల్ ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరు తలబడితే ఆ మజాయే వేరు. ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ సమయంలో సోషల్ మీడియా వేదికగా పాల్, వర్మ ఢీకొనడం చూశాం. అవి నెటిజన్స్ కి ఫుల్లుగా వినోదం పంచాయ్. తాజాగా కరోనా విషయంలోనూ పాల్ పై సటైర్స్ వేశారు వర్మ.

‘అరే కేఏ పాలు..ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బరావు’. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేట్లు చేయి ఎంకమ్మ’ అంటూ ట్విట్స్ చేశారు వర్మ. దీనిపై కేఏ పాల్ ఎలా స్పందిస్తారు ? అనేది చూడాలి. 

ఇక దేశంలో కరోనా వైరస్ రోజురోజూకి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 166 కరోనా కేసులు నమోదయ్యాయ్. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరగా.. ఏపీలో 2కి చేరింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వం మరింత అలర్టయ్యాయ్.