బ్రేకింగ్ : తిరుమల ఆలయం మూసివేత

కరోనా ఎఫెక్ట్ తో తిరుమల ఆలయం మూతపడనుందా ? అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే అలిపిరి చెక్ పోస్ట్ మూసివేశారు. మెట్ల మార్గం కూడా మూసివేయబడింది. కొండపైకి ఎవరిని వెళ్లనీయడం లేదు. ఎందుకంటే ? తిరుమతి కొండపైన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. అతడికి తిరుపతి రిమ్స్  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడికి కరోనా పాజిటివ్ తేలే అవకాశాలున్నట్టు చెబుతున్నారు

ఈ నేపథ్యంలో తిరుమల ఆలయాన్ని తాత్కాళీకంగా మూసివేసేందుకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో టీటీడీ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో తిరుమల ఆలయాన్ని మూసివేయడంపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక దేశంలో ఇప్పటివరకు 180 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 13 కేసులు నమోదు కాగా, ఏపీలో 2 కేసులు నమోదయ్యాయి.