బ్రేకింగ్ : 5కు చేరిన కరోనా మృతుల సంఖ్య

మన దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మనం రెండో దశలో ఉన్నాం. రాబోయే ఒకట్రెండు వారాల్లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌లో కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 5కు చేరింది. జైపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో 65 ఏళ్ల ఇటాలియన్‌ టూరిస్టు మృతి చెందాడు. అతడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే అతడు గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
 
ఇక గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 22 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో ఈ వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 195కు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 32మంది విదేశీయులే కావడం గమనార్హం. అయితే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఇప్పటివరకు 20మంది కోలుకోగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 171మంది చికిత్స పొందుతున్నారు.