డాక్టర్ సాయితేజు

హీరోలకి చదువెక్కడు అంటారు. మన స్టార్ హీరోలు అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ తదితరులు పై చదువులు చదువుకోలేదు. సినిమాల్లో మాత్రం లా, మెడిసిన్.. లాంటి కోర్సులు చేస్తుంటారు. వకీల్ సాబ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ లాయర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ కోసం ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక మెగా యంగ్ హీరో సాయిధరమ్ డాక్టర్ గా మారబోతున్నాడు. చిత్రలహరితో హిట్ ట్రాక్ లోకి వచ్చిన సాయితేజ్ ప్రతిరోజూ పండగే సినిమాతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కతోంది. ఈ సినిమా తర్వాత దేవాకట్టా దర్శకత్వంలో సాయితేజు సినిమా ఉండనుంది.

ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. రాజకీయం నేపథ్యంలో సాగే సోషల్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందట. ఇందులో సాయితేజ్ డాక్టర్ గా కనిపిస్తాడట. ఏలూరు, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. మరి రాజకీయాలకు డాక్టర్ వృత్తికి ఎలా ముడిపెట్టాడు అన్నది ఆసక్తికర పాయింట్ గా ఉంటుందట. ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను పోషించనుందట.