26నుంచి తిరుమలలో ధన్వంతర యాగం

తిరుమల తిరుపతి దేవస్థానం ధన్వంతరం యాగం నిర్వహించనుంది. ఈ నెల 26 నుంచి మూడ్రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. లోక కల్యాణం కోసమే ఈ యాగం నిర్వహించబోతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ యాగానికి పూజారులు, పీఠాధిపతులు మాత్రమే హాజరవుతారని సుబ్బారెడ్డి తెలిపారు.

ఇక కరోనా ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. తిరుమల దేవాస్థానం కూడా మూతపడింది. తిరుమల దేవస్థానం మూతపడటం చరిత్రలో ఇది రెండోసారి. ఇక గ్రహణం సమయాల్లోనూ తెరిచి ఉండే శ్రీకాళహస్తి దేవాలయం కూడా మూతపడింది.