తెలంగాణలో 24గంటల పాటు జనతా కర్ఫ్యూ

జనతా కర్ఫ్యూ పాటించడంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిలవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపు (ఆదివారం) దేశంలో జనతా కర్ఫ్యూ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

12గంటలు కాదు.. తెలంగాణ ప్రజలు 24గంటల పాటు జనతా కర్ఫ్యూ నిర్వహించాలని సూచించారు. ఎన్నో యేళ్లుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నం. అదే విధంగా కరోనా కట్టడి విషయంలోనూ అదే స్పూర్తితో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బస్సులు బంద్ చేస్తున్నాం. అన్నీ రకాల షాపులని స్వచ్ఛందంగా బంద్ చేయాలని సూచించారు. నిత్యవసర వస్తులకి మాత్రం మినహాయింపు ఇచ్చారు.