కరోనాపై కేసీఆర్ జోక్

సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వస్తే.. ఎంత సీరియస్ మేటర్ అయినా.. ఓ జోక్ మాత్రం వేస్తుంటారు. కరోనా లాంటి సీరియస్ మేటర్ పై సీఎం కేసీఆర్ వేసిన జోక్ ఆకట్టుకుంది. ఆదివారం జనతా కర్ఫ్యూకి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

జనతా కర్య్ఫూ పాటించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో 24గంటల పాటు జనతా కర్ఫ్యూని పాటించాలని పిలుపునిచ్చారు. కరోనాకి మందులేదు. ముందు జాగ్రత్తలే శరణ్యమని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో కరోనాపై సోషల్ మీడియాలో జరుగుతున్న జోక్ ని చెప్పాడు.

కరోనా వైరస్ కి స్వాభిమానం ఎక్కువ. అది పిలిచేవరకు మన ఇంటికి రాదు. ఈ నేపథ్యంలో బయటి ఉన్న కరోనా వైరస్ ని మన ఇంటికి పిలవొద్దు. 24గంటల పాటు తెలంగాణ ప్రజలు జనతా కర్ఫ్యూని నిర్వహించాలని పిలుపునిచ్చారు.