కాజల్ రేటు.. రెండున్నర కోట్లు ?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా కోసం హీరోయిన్ గా త్రిషని తీసుకున్నారు. అయితే ఆమె సడెన్ గా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక త్రిష స్థానంలో కాజల్ ని తీసుకోవాలని చిత్రబృందం భావించింది. కానీ కాజల్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందనే ప్రచారం జరిగింది. ఏకంగా రెండున్నర కోట్లు అడిగిందట. ఫైనల్ గా కోటిన్నరకి బేరం కుదిరినట్టు సమాచారమ్.

కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో ఆచార్య తెరకెక్కుంది. ఇందులో మెగాస్టార్ మాజీ నక్సలైట్ గా, దేవాదాయ శాఖ ఉద్యోగిగా కనిపిస్తారని సమాచారమ్. అంతేకాదు.. ఈ సినిమాలో ఓ 30నిమిషాల నిడివి గల కీలక పాత్ర ఉంది. ఇందులో మహేష్ లేదా రామ్ చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది. ఈ పాత్రలో నటించేవారికి జంటగా రష్మిక మందన కనిపిస్తారని చెప్పుకొంటున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టులో ఆచార్యని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.