రాజమౌళి, పవన్, ఎన్టీఆర్’లపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్

కరోనా ఎఫెక్ట్ సినిమా షూటింగ్ బంద్ అయ్యాయ్. దీంతో సెలబ్రేటీలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో కూర్చొని ఇష్టం వచ్చిన పనులు చేసుకొంటున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కాసేపు సరదాగా చాట్ చేశారు. వారు అడిగిన ప్రశ్నలకి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. కేజీఎఫ్ 2 అక్టోబర్ 23నే ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు.

రాజమౌళి, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌లపై మీ అభిప్రాయం చెప్పండని నెటిజన్స్ ప్రశ్నించగా.. రాజమౌళి ఓ సృష్టికర్త, పవన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ అన్‌మ్యాచబుల్‌, ఇక ఎన్టీఆర్‌ ఎవరితో పోల్చలేని నటుడు అంటూ కితాబిచ్చారు. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తదుపరి చిత్రాల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కేజీఎఫ్ 2 తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోతోనే ప్రశాంత్ నీల్ సినిమా ఉండనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ లతో ప్రశాంత్ నీల్ వరుసగా సినిమాలు చేయబోతున్నారనే టాక్ కూడా ఉంది.