21 రోజులు పాటు లాక్‌డౌన్ ఎందుకంటే ?

కరోనా కట్టడి కోసం కేంద్రం సంచలన నిర్ణయం తీసుకొంది. ఈ నెల 31 వరకు మాత్రమే కాదు.. వచ్చే నెల 14 వరకు.. అంటే 21 రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని.. అలా జరగకపోతే 21 సంవత్సరాలు వెనక్కి వెళతామని పధాని అన్నారు. అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ వివరించారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని కోరారు.