పక్క రాష్ట్రాన్ని కూడా పట్టించుకున్న ఏకైక హీరో


టాలీవుడ్ హీరోలు రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన టాలీవుడ్ ప్రముఖులు పెద్ద మనసుని చూపిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రజల్లో అవగాహన కల్పించే పనులతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలకి తోచిన సాయం చేస్తున్నారు. అంతేకాదు.. పీఎం రిలీఫ్ పండ్ కి విరాళాలు ఇస్తున్నారు.

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకి సాయం ప్రకటించారు. మూడు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.1.25 కోట్లను విరాళంగా ప్రకటించాడు. ఈ మొత్తంలో రూ.50 ల‌క్ష‌లు ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సహాయనిధికి, మ‌రో రూ.50 ల‌క్ష‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందిస్తున్న‌ట్టు అల్లు అర్జున్ తెలిపాడు. అలాగే రూ.25 ల‌క్ష‌లు కేర‌ళ  ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు చెప్పాడు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతి సినిమా అక్కడ రిలీజ్ అవుతుంటాయ్. మంచి కలెక్షన్స్ రాబడుతుంటాయ్. అయితే తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ హీరోలు ఉన్నారు. వారెవరు తెలుగు రాష్ట్రాల కోసం పైసా తీయడం లేదు. ఈ లెక్కన మన బన్నీ గొప్పోడు. మనసున్నోడని చెప్పాలి.