పవన్-క్రిష్ సినిమా ఓ టాక్.. !

చాన్నాళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వకీల్‌సాబ్‌’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మే నెలలో రావాల్సిన ‘వకీల్‌సాబ్‌’ మరింత ఆలస్యంగా రాబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ సినిమా కోసం పవన్ సమయం కేటాయిస్తున్నారు. ఇప్పుడీ సినిమా గురించి ఓ టాక్ వినిపిస్తోంది. ఇందులో పవన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక రెండు భిన్న పాత్రల్లో కనిపిస్తారా? అన్నది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఇప్పటివరకూ పవన్‌ ద్విపాత్రాభినయం చేయలేదు. ఒకే సినిమాలో రెండు వైవిధ్య పాత్రలను పోషించారు.