కారోనా ఎఫెక్ట్.. మోహన్ బాబు-చిరు హగ్ క్యాన్సిల్ !

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం లభించింది. చిరుకి వెల్ కమ్ చెప్పిన వారిలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఒకరు. ‘మిత్రమా స్వాగతం.. ‘ అంటూ మోహన్ బాబు ట్విట్ చేశారు. దానికి రిప్లై ఇచ్చిన చిరు.. ‘రాననుకున్నావా..రాలేననుకున్నావా ?’ అంటూ డైలాగ్ కొట్టాడు. 

దానికి మోహన్ బాబు కూల్ గా.. ఈ సారి హగ్ ఇచ్చినప్పుడు చెబుతానన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హగ్ ఇచ్చే పరిస్తితి లేదు. దాన్ని సమయోచితంగా వినియోగించిన చిరు.. ‘కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే హగ్స్, షేక్ హాండ్స్ ఇచ్చుకోకూడదు, సోషల్ డిస్టెన్స్ అవసరం’ అంటూ ట్విట్ చేశారు. ఇప్పుడు చిరు-మోహన్ బాబుల ట్విట్టర్ సంభాషణ వైరల్ అవుతోంది. అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అసలే ఇంటికి పరితమైన జనాలకి సోషల్ మీడియా వేదిక మెగాస్టార్ మాంఛి వినోదాన్ని పంచుతున్నారు.