నివేదా ఇప్పుడు  కూడా అదే మూడులో !

సినీ తారలకి కరోనా సెలవులు వచ్చేశాయ్. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీంతో సినీ తారలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో నచ్చిన పనులు చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజు మాత్రం రొటీన్ పని చేస్తున్నట్టుంది.

అదే ఫోటో షూట్. కరోనా సెలవుల్లోనూ నివేదా ఫోటో షూట్ లో పాల్గొన్నట్టుంది. అది కూడా బయటకాదు. మేడ మీద. తాజాగా నివేదా తన ట్విట్టర్ ఖాతాలో ఓ పిక్ షేర్ చేశారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో కిర్రాక్క్కుంది. అయితే ఇది లెటెస్ట్ పిక్ నా ? లేక గతంలో తీసిందా ?? అనేది తెలియదు. ఒకవేళ లెటెస్ట్ పిక్ అయితే నివేదా ఇప్పటికీ అదే మూడులో ఉన్నట్టే.

ఇక ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నివేదా. చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అల.. వైకుంఠపురంలో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటిస్తున్న రెడ్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది.