పాక్ కుట్ర : భారత సైన్యంపై కరోనా అస్త్రం

మహమ్మారి కరోనా వైరస్ ని అస్త్రంగా చేసుకొని భారత సైన్యాన్ని దెబ్బతీయాలేని కుట్ర చేస్తోంది పాక్ ఆర్మీ. ఈ మేరకు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. పీఓకేలో పాక్ సైనికులతో టచ్‌లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులకు కరోనా సోకింది. సుమారు 800 మంది కరోనా పీడిత ఉగ్రవాదులను నియంత్రణ రేఖ దాటించాలని పాక్ ఆర్మీ లక్ష్యం పెట్టుకుందని నిఘావర్గాలు పసిగట్టాయి.

ఆర్మీ గత 48 గంటల్లో జమ్ముకశ్మీర్‌లో ఎల్‌ఓసీని దాటి భారత భూభాగంలోకి చొచ్చుకొస్తోన్న 9 మంది ఉగ్రవాదులను ఇండియన్ మట్టుబెట్టింది. కరోనాతో దెబ్బతీయాలనుకుంటోన్న పాక్ కుట్రను సమర్థంగా తిప్పి కొడ్తామని భారత సైన్యం చెబుతోంది. ఇలాంటి విషయాలు వెలుగులోనికి వచ్చిన సమయంలోనే ఢిల్లీ నిజాముద్దీన్ సమావేశం వంటివాటిని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు.