తెలంగాణకు ఎంపీ సుజనా భారీ విరాళం

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్రాలు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నానికి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు తమవంతు సాయంగా విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ ప్రభుత్వానికి రూ.1.6కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ని కలిసి చెక్ అందించారు. ఇందులో ఎంపీ ఫండ్స్ నుంచి కోటి రూపాయలు, సుజనా ఫౌండేషన్ నుంచి 50 అందజేశారు. మరో రూ.10లక్షల విలువ గల ఫేస్ మాస్క్ లుని అందజేస్తున్నట్టు తెలిపారు.

“కరోనాపై పోరులో తెలంగాణకు తోడ్పడేందుకు ఎంపి ఫండ్స్ నుంచి కోటిరూపాయలు, సుజనా ఫౌండేషన్ నుంచి 50 లక్షలు మంత్రి కెటిఆర్ @KTRTRS గారికి అందజేశాము. ముంబై ఐఐటి అల్యూమిని, తెలంగాణ కో ఆపరేటివ్ వీవర్స్ అసోసియేషన్ సహకారంతో 10 లక్షలు విలువ గల ఫేస్ మాస్కులను ఫౌండేషన్ ద్వారా సరఫరా చేస్తాము” ఎంపీ సుజనా తెలిపారు.