పోసాని.. 50 కుటుంబాలకి ఆసరా !

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి దయాగుణం గురించి తెలిసిందే. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఆదుకొనేందుకు ముందుకొస్తారు. గతంలో ఆయన చాలా సందర్భాల్లో చాలా సార్లు సాయం చేశారు. తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులని ఆదుకొనేందుకు సినీ తారలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన సిసిసి మీ కోసం సంస్థకి భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. మరికొందరు నేరుగా సాయం చేస్తున్నారు. తాజాగా నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న 50 పేద కుటుoబాలకు నెలకు సరిపడేవిధంగా సరుకులు అందజేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా రోజురోజూకి విజృంభిస్తోంది. కరోనా సోకి ఏపీ నలుగురు, తెలంగాణలో 11మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.