దేశంలో కరోనా కేసులు 5194, మరణాలు 149

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 5194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది మృతి చెందారు. మొత్తం బాధితుల్లో 402మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 773 పాజిటివ్‌ కేసులు, 35 మరణాలు సంభవించాయి.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా ఇక్కడ 64మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. 1018కి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక తెలంగాణలో 404 కరోనా కేసులు నమోదు కాగా.. 11మంది మృతి చెందారు. ఏపీలో 314 కరోనా కేసులు నమోదు కాగా.. 4గురు మృతి చెందారు.