ఓటీటీకి ఓటేసిన మరో టాలీవుడ్ నిర్మాత

వినోద ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం ఓటీటీ త‌న హ‌వా చాటుతుంది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ వంటివి జ‌నాల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ నిర్మాత‌లు కూడా డిజిటల్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్, శరత్ మరార్, స్వప్న‌ దత్, క్రిష్ మరియు మరికొందరు నిర్మాతలు డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లను రూపొందిస్తున్నారు.

తాజాగా ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత సాయి కొర‌పాటి కూడా ఓటీటీ ప్రపంచ‌లోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అది ముగిశాక పలు వెబ్‌ సిరీస్‌ల‌ని రూపొందించేందుకు ప్రణాఌకలు వేసుకుంటున్నారు. ఈగ‌, లెజెండ్ సినిమాలు సాయి కొర్రపాటికి నిర్మాతగా మంచి లాభాలు తీసుకొచ్చాయి. ఆయన కేజీఎఫ్‌2, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్న సంగతి తెలిసిందే.