మహేష్ పై తీవ్ర ఒత్తిడి

సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఒత్తిడి పెరిగినట్టు సమాచారమ్. ఎందుకంటే ? తోటి స్టార్స్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, ఎన్టీఆర్ కి పాన్ ఇండియా సినిమా పడింది. ఆర్ఆర్ఆర్ తర్వాతి సినిమాని కూడా పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేసుకుంటున్నారు తారక్, చరణ్. ఇక విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా సినిమాగా ‘ఫైటర్’ తెరకెక్కుతోంది.

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పిరియాడికల్ డ్రామా పాన్ ఇండియా సినిమాగా రాబోతుందని చెబుతున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సివుంది. ఇక ‘పుష్ప’తో తొలి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక మిగిలింది మహేష్ బాబు మాత్రమే. దీంతో ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. మహేష్ ని కూడా పాన్ ఇండియా సినిమా చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

మహేష్ తదుపరి సినిమా పరశురామ్ దర్శకత్వంలో ఉండనుంది. ఇదో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెబుతున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా కైరా అద్వానీ, సారా అలీఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత మహేష్ పాన్ ఇండియా చేసే ప్రయత్నాలు చేయొచ్చు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. అది పాన్ ఇండియా సినిమాగా రాబోతుందనే ప్రచారం జరిగింది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సివుంది.