ఇకపై అన్నీ పాన్ ఇండియా సినిమాలే.. !!

తెలుగు సినిమా దేశాన్ని ఏలేందుకు రెడీ అవుతోంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి పెరిగిన సంగతి తెలిసిందే. బాహుబలి స్పూర్తితో తెలుగు నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. గత యేడాది తెలుగు నుంచి సాహో, సైరా లాంటి పాన్ ఇండియా సినిమాలొచ్చాయ్.

ఈ యేడాది మూడు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా సినిమాగా ‘ఫైటర్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సుకుమార్-అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. చాన్నాళ్ల నుంచే పాన్ ఇండియా కథలని వింటున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్కరే మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లకి కథలు వినిపించి ఓకే చేయించుకొన్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో టాలీవుడ్ స్టార్స్ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.