భారీ రేటుకు సాహో శాటిలైట్ రైట్స్ 

భారీ అంచనాలు, ఆశల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ ‘సాహో’ నిరాశపరిచింది. అయితే, మిక్సిడ్ టాక్ వచ్చినా.. బాలీవుడ్ లో సాహో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా రూ. 150కోట్లు కలెక్ట్ చేసింది. అయితే దర్శకుడు సుజీత్ భారీ బడ్జెట్, పెద్ద టాలెంట్,  విలువైన సమయాన్ని వృధా చేశారనే విమర్శలొచ్చాయ్.

సాహో రిలీజ్ టైంలో శాటిలైట్ రైట్స్ డీల్ కాలేదు. ఇప్పుడా డీల్ కుదిరినట్టు సమాచారమ్. రెండు వారాల క్రితమే సాహో శాటిలైట్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మరికొన్ని రీజనల్ లాంగ్వేజెస్ కలిసి 20 కోట్ల దగ్గరలో డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు శాటిైలైట్ నే 12 కోట్లకు రేట్ కట్టినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించారు. దాదాపు రూ. 250కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన సాహో భారీ నష్టాలనే మిగిల్చినట్టు సమాచారమ్. ప్రస్తుతం ప్రభాస్ రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండనుంది. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే.