బాలీవుడ్ ని ఢికొట్టేందుకు ‘పుష్ప’ గట్టి ప్లాన్

బాలీవుడ్ సినిమా చేయాలన్న స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కోరిక ‘పుష్ప’తో తీరనుంది. బన్నీ-సుకుమార్’ల హ్యాట్రిక్ చిత్రంగా ‘పుష్ప’ రాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, ఇంకా చెప్పాలంటే దక్షిణాది సినీ పరిశ్రమకి బనీ-సుక్కుల కాంబో గురించి తెలిసి ఉంటుంది. కానీ బాలీవుడ్ కు తెలీయదు కదా ! అందుకే బాలీవుడ్ ని గట్టిగా ఢీకొనేందుకు ‘పుప్ప’ గట్టి ప్లాన్ నే చేస్తున్నాడట.

‘పుష్ప’ హీరోయిన్ గా రష్మిక మందనని తీసుకున్నారు. ఓ కీలక పాత్ర కోసం తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. అయితే మెయిన్ విలన్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరోలు సంజయ్ దత్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ లలో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నట్టు సమాచారమ్. దీంతోపాటు పలువురు బాలీవుడ్ నటీనటులని పుష్ప కోసం తీసుకోనున్నారని తెలుస్తోంది. తద్వారా బాలీవుడ్ సినిమా ఫ్లేవర్ తీసుకురావాలన్నది సుక్కు ప్లాన్ లా కనిపిస్తోంది.

ఇక ఎర్రచందనం స్ల్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ సినిమా ఉండనుంది. ఇందులో బన్నీ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడుని తెలుస్తోంది. బన్నీ బర్త్ డే కానుకగా విడుదల చేసిన పుష్ప ఫస్ట్ లుక్ లో ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా ఫీవర్ తో పుష్ప రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.