లాక్ డౌన్ ఎఫెక్ట్.. సల్మాన్ గడ్డి తింటున్నాడు !

లాక్ డౌన్ పుణ్యమా అని సినీ తారల స్పెష టాలెంట్స్ బయటపడుతున్నాయి. కరోనా ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినీ తారలు ఇంటికే పరిమితమయ్యారు. తమకి ఇష్టమైన పనులు చేసుకొంటున్నారు. కొత్త కొత్త పనులని ట్రై చేస్తున్నారు. కాజల్ సమోసాలు చేసింది. మరికొందరు హీరోయిన్స్ కూడా వంటింట్లోకి దూరం ప్రయోగాలు చేస్తున్నారు. చేతులు కాల్చుకొంటున్నారు. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ చేసిన పని మాత్రం ఆశ్చార్యానికి గురిచేస్తోంది.

ఆయన ఏకంగా గడ్డి మేస్తున్నారు. ఇదే తన బ్రేక్ ఫాస్ట్ అని కూడా చెబుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా దొరికిన ఈ ఖళీ సమయాల్లో సల్మాన్‌ తన పెంపుడు జంతువులతో గడిపేస్తున్నాడు. లాక్‌డౌన్ విధించిన దగ్గరి నుంచి ఫామ్ హౌజ్‌కే పరిమితమైన సల్మాన్‌ఖాన్ అక్కడ వున్న తన హార్స్‌తో కాలక్షేపం చేస్తున్నాడు ఉదయం గడ్డి తినిపిస్తూ తను కూడా తినడం నెటిజన్స్‌ని షాక్ కు గురిచేసింది. ఇదే నా బ్రేక్ ఫాస్ట్ అంటూ సల్మాన్ పోస్ట్ పెట్టడం, ఆ వీడియోని సల్మాన్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

View this post on Instagram

Breakfast with my love…

A post shared by Salman Khan (@beingsalmankhan) on