పవన్, బాబులపై విజయసాయి సటైర్స్

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక వేసే పంచులు, సటైర్స్ ఆకట్టుకొంటాయి. తాజాగా ఆయన ఒకేసారి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సటైర్స్ వేశారు.

“ప్రతిపక్ష నేతగా ఐదు కోట్ల ప్రజానీకం తరపున మాట్లాడాల్సిన వ్యక్తి భ్రమరావతి కోసం మూడు గ్రామాలకు పరిమితమయ్యాడు. ఇప్పుడు ముగ్గురి ఉద్యోగాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ తన పరిధిని తనే కుదించుకుంటూ పోతున్నాడు. వాటే గ్రేట్ ఫాల్!” అంటూ చంద్రబాబుపై సటైర్స్ వేశారు. 

కొద్దిసేపట్లో పవన్ పై పడిపోయాడు విజయసాయి. “పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే  మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు” అంటూ తీవ్ర కామెంట్స్ చేశారు. 

మరీ.. బాబు, పవన్ ల నుంచి విజయసాయిపైకి ఎలాంటి కౌంటర్లు క్యూ కడతాయ్ అన్నది వేచి చూడాలి.