ప్రధాని ప్రసంగం.. రేపు ఉదయం !

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ప్రకటన చేయనున్నారు. ముందుగా ఈరోజే ప్రధాని ప్రసంగం ఉంటుందనే వార్తలు వినిపించాయి. అయితే అది రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగంలో లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రకటన చేయనున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించాలంటూ ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్‌బెంగాల్‌ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ పొడగింపు సందర్భంగా కొన్ని రంగాలకి మినహాయింపు ఇవ్వబోతున్నట్టు సమాచారమ్.