జవహర్ నగర్ లో విషాదం

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. డెంటల్ కాలేజీ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూడా చున్నిల సాయంతో చెట్టుకి ఉరి వేసుకొని వేలాడి ఉన్నారు. ఘటనాస్థలిలో ఓ చిన్నారి మృతదేహం కూడా ఉంది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ కారణంతో చనిపోయారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలో లభించిన సెల్ ఫోన్ల ఆధారంగా వారి వివరాలు సేకరిస్తున్నారు. అసలు వీరిది ఆత్మహత్యేనా ? లేక హత్య చేసిన తర్వాత ఇలా చిత్రీకరించారా ?? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.