బ్రేకింగ్ : మే 3 వరకు లాక్ డౌన్ పొడగింపు


కరోనా కట్టడి కోసం దేశంలో లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరో 19రోజుల పాటు అంటే.. మే 3 వరకు లాక్ డౌన్ పొడగించారు. ఈ మేరకు జాతినుద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు.  ఇతర దేశాలతో పోలీస్తే కరోనా కట్టడిలో మనం మెరుగ్గా ఉన్నాం అన్నారు ప్రధాని. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ ద్వారా చాలా లాభపడ్డాం అన్నారు. ముందు చూపుతోనే 21 రోజుల పాటు లాక్ డౌన్  ప్రకటించడం మంచి ఫలితాన్ని ఇచ్చిందని ప్రధాని అన్నారు. ఇంకా ప్రధాని ప్రసంగం కొనసాగుతోంది.