ప్రజలకి ప్రధాని ఏడు సూచనలు

ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపై ప్రకటన చేశారు. మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రజలకి ఏడు కీలక సూచనలు చేశారు.

1. సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి

2. అత్యవసర విధుల్లో ఉన్నవారిని గౌరవిద్దాం

3. పేదలకు ఆకలితో, ఆపదలో ఉన్నవారికి మరింత సాయం చేద్దాం

4. ఏ ప్రైవేటు సంస్థ ఉద్యోగులపై వేటు వేయొద్దు

5. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి

6. ఆరోగ్య సేతు ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోండి..సురక్షితంగా ఉండండి

7. భౌతిక దూరం పాటించాలి.. కరోనాను తరిమేయాలిలని ప్రధాని ప్రజలకి సూచించారు.