కరనాపై ఎస్పీ సరిత పాట

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ తారలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. వీడియో మెసేజ్, పాటల రూపంలో కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారిణి సరిత స్వయంగా పాట పాడి.. సామాజిక దూరం ఆవశ్యకతను వివరించారు.

పోరాటంలో పోలీసులు ముందున్నారని, యువత అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామని.. ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పుడీ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఓసారి వినేయండీ.. !

https://blackmount.pc.cdn.bitgravity.com/cmseenadu/coronasong_140420.mp4#amp=1