కేటీఆర్ సడెన్ ఎంట్రీ


మంత్రి కేటీఆర్ సడెన్ ఎంట్రీలతో అదరగొడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన ఆయన ఇంటికే పరిమితం కావడం లేదు. బయట తిరుగుతూ ప్రజల సాదక బాధకాలని స్వయంగా తెరచుకుంటున్నారు. ఇటీవల వలస కూలీల శిబిరాలని మంత్రి కేటీఆర్ సందర్శించిన సంగతి తెలిసిందే. బుధవారం వేములవాడలో ఆకస్మిక పర్యటన చేశారు మంత్రి కేటీఆర్.

ఇక ఈ రోజు హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌, ఆసిఫ్‌నగర్‌ ఏరియాల్లోని కంటైన్‌మెంట్‌ జోన్లలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన చేశారు. ఆ ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రజలకు కేటీఆర్‌ సూచించారు. ప్రభుత్వ విధానాలకు ప్రజలందరూ సహకరించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.