రంగోలికి పంచ్ పడింది

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ సోదరి, ఫైర్‌బ్రాండ్‌ రంగోలికి పంచ్ పడింది. ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్‌ చేశారు. బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్‌ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్‌ మీడియాను కాల్చి చంపాలని రంగోలి ట్వీట్‌ చేసింది. దీనిపై బాలీవుడ్ ప్రముఖులు భగ్గుమన్నారు. రంగోలీ అకౌంట్‌ ని బ్లాక్ చేయాలని కోరారు.

దీనిపై స్పందించిన ట్విటర్‌ అధికారులు రంగోలీ అకౌంట్‌ను సస్పెండ్‌ చేశారు. దీంతో బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌  ట్విట్టర్ అధికారులకి కృతజ్ఝతలు తెలిపారు. ఇక ట్విట్టర్ రీ ఎంట్రీ తర్వాత రంగోలీ రియాక్షన్ మాములుగా ఉండదేమో. ఆమె ఎటాక్ చేస్తే ఎదుటివారు నోరు మూసుకోవాల్సిందే. ఆ రేంజ్ లో రంగోలీ దాడి ఉంటుంది మరీ. ప్రస్తుతానికి మాత్రం నెటిజన్స్ కి రంగోలీ బాధ నుంచి విముక్తి లభించిందని చెప్పవచ్చు.