పేతురాజు రొమాంటిక్ యాక్షన్ 


‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నివేదా పేతురాజు. చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అల.. వైకుంఠపురంలో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటిస్తున్న ‘రెడ్’ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు సుకుమార్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారమ్.

ఇక కరోనా లాక్‌డౌన్ తో ఇంటికే పరిమితమైన సినీతారాలు అభిమానులతో మాత్రం టచ్ లోనే ఉంటున్నారు. హోం క్వారంటైన్ ఫోటోలు, స్పెషల్ వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి. నివేథా పేతురాజు కొత్త ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పేతురాజు యాక్షన్ మూడులో కనిపిస్తున్నా.. ఎద అందాలతో ఎరవేసే ప్రయత్నం చేసింది. భలేగుంది.. నివేదాతో పూరి ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేయొచ్చు కదా.. అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.