మహేష్’తో రాజమౌళి సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది !

సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కూడా మహేష్ సినిమా తప్పక ఉంటుందన్నారు. చాలా ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఈ నేపథ్యంలో బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా మహేష్ తో ఉంటుందని భావించారు. కానీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ‘ఆర్ఆర్ఆర్’ ప్లాన్ చేశాడు జక్కన్న. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ తోనే సినిమా ఉంటుందని తాజాగా రాజమౌళి ప్రకటించేశారు.

దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని రాజమౌళి తెలిపారు. ఒక సినిమా చేస్తున్నప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఎప్పుడూ బయటపడలేదు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తుండగానే మహేశ్‌ ప్రాజెక్ట్‌ గురించి ప్రకటించడం విశేషం. మహేశ్‌బాబుకు సెట్‌ అయ్యే విధంగా తన దగ్గర ఓ మంచి స్టోరీ లైన్‌ ఉందని, దానిని డెవలప్‌ చేస్తున్నానని ఒకానొక సందర్భంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ తెలిపిన విషయం తెలిసిందే.