కార్మికులకి జీతాలు చెల్లించండి : కేటీఆర్ 

ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించవద్దని, వారికి జీతాలు చెల్లించాలని మంత్రి కేటీఆర్ కోరారు. సోమవారం జిల్లాల కార్మిక, పరిశ్రమలశాఖ అధికారులతో మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యంపై ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించొద్దని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కార్మికులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలకు కూడా విద్యుత్‌ బిల్లులు, ఆస్తిపన్ను చెల్లింపులో ప్రభుత్వం అనేక వెసులుబాటు కల్పించిందని మంత్రి తెలిపారు.