ఏపీలో కరోనా విశ్వరూపం

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజూకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే 75 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 20, కర్నూలులో 15, కృష్ణాలో 5, అనంతపురంలో 4, కడపలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 2 చొప్పున నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కి చేరింది. మరో 17మంది మృతి చెందారు.

తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం కొత్త మరో 14కేసులు నమోదయ్యారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 872కి చేరింది. మరో 23 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక రంజాన్ ప్రార్థనలని సాముహికంగా జరుపుకోవద్దని.. ఇంటివద్దనే ప్రార్థనలు చేసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలు ముస్లిం మత పెద్దలని కోరారు. ప్రభుత్వ రిక్వెస్ట్ కి ముస్లిం పెద్దలు కూడా ఓకే చెప్పారు.