వైరల్ : జాన్వీ కొత్త స్టిల్


అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తొలి సినిమా ‘దఢక్’తో పాపులర్ అయిపోయింది. అయితే సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరించడం జాన్వీ ప్రత్యేకత. ఆమె ఫోటోలు, వీడియోలు నెటిజన్స్ ఫిదా చేస్తుంటాయి. కరోనా లాక్‌డౌన్ వేళ జాన్వీ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ని మార్చింది.

కొత్త ప్రొఫైల్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగని.. ఇందులో గ్లామర్ డోస్ ఏమీ వడ్డించలేదు. సింపుల్ పిక్. సైడ్ లుక్ లో. కవ్వించి కళ్లు, చిరు దరహాసం ఉన్న రెండు ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం జాన్వీకపూర్ ‘గుంజన్ సక్సేనా’ సినిమాలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.