మెగాస్టార్ కోసం ముగ్గురు దర్శకులు

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా ‘ఆచార్య’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుసగా యువ దర్శకులతో పనిచేసేందుకు చిరు ప్లాన్ చేసుకుంటున్నారు. ‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్  ‘లూసిఫర్’ రీమేక్ లో నటించబోతున్నారు. ఆ బాధ్యతని యువ దర్శకుడు సుజీత్కి అప్పజెప్పారు చిరు.

‘సాహో’ బాగా తీయలేదని సుజీత్ పై ఆరోపణలున్నాయి. అయినా.. సుజీత్ పై చిరు నమ్మకం ఉంచారు. ఇక ఇటీవల యంగ్ డైరెక్టర్స్ బాబీ, మెహర్ రమేష్ కథలు చెప్పారని స్వయంగా చిరునే చెప్పారు. అంతేకాదు.. మెహర్ రమేష్ తో సినిమా ఫిక్సయిందని ప్రకటించారు. ఈ న్యూస్ మెగా అభిమానులని భయపెడుతోంది. ఎందుకంటే ? మెహర్ రమేష్ ఇచ్చిన అట్టర్ ప్లాపులు అలాంటివి. అందుకే మెహర్ రమేష్ తో సినిమా అంటే.. మెగా అభిమానులు వణికిపోతున్నారు. మరీ.. చిరు ఏధైర్యంతో ఆయనకి ఓకే చెప్పారో.. !